Post navigation ది. 08.03.2023పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …సమాజంలో అనితరసాధ్యమైన పాత్ర పోషిస్తున్న మహిళలు : పోలీస్ కమిషనర్ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తూ…అనితరసాధ్యమైనపాత్ర పోషిస్తున్న మహిళలకుసమాజంలో గొప్ప స్ధానం వుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ బి కాన్ఫరెన్స్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసిన మహిళ పోలీస్ అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..అభివృద్ధి, నిర్ణయాలలో ఆదర్శవంతగా కీర్తించబడే స్త్రీమూర్తి…ఉజ్వల భవిష్యత్ కు పునాది వేస్తున్నారని తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్ లో భాగంగా మహిళలకు 33% రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని అన్ని రంగాలలో మరింత రాణించాలని, నేటి పోటి ప్రపంచంలో పురుషులకు దీటుగా ప్రతికూల పరిస్థితులను అధికమించి అన్ని రకాల వ్యవస్థలను నడిపే శక్తిగా…మహిళలు రాణిస్తున్నారని అన్నారు.ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని, మహిళలను తక్కువ చేసే దోరణి మారిందని అన్నారు.కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ ప్రదర్శించిన నాటిక ఎంతగానో ఆకట్టుకుంది.మహిళలకు సంబంధించిన కేసులలో నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా పోక్సో, నిర్భయ చట్టాలను జిల్లాలో పకడ్భందిగా అమలవుతున్నాయని అన్నారు.ముఖ్యంగా యువత, విద్యార్థినులు తమ భద్రత కోసం డయల్ 100, షీ టీమ్ సేవలను సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో వివిధ విభాగాలలో పనిచేస్తున్న పలువురు మహిళలను సన్మానించారు.కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ( AR) కుమారస్వామి, కృష్ణ ప్రసాద్ మెమరీ స్కూల్ చైర్ పర్సన్ హృదయ మీనన్, ఏసీపీలు గణేష్, రెహమాన్, ప్రసన్న కుమార్, రవి AO అక్తరూనీసా బేగం, సిఐలు అంజలి, సర్వయ్య, సురేష్,షీ టీమ్ ఎస్ ఉమా పాల్గొన్నారు.పి ఆర్ వో సందేశ్ కరాటి అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ పల్లా జాన్ రాములు మెమోరియల్ నేషనల్ షోటోకాన్ కరాటే చాంపియన్షిప్ – 2023 ను ప్రారంభించిన పల్లా కిరణ్.పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు…ఖమ్మం : గాంధీచౌక్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో బ్లాక్ బెల్ట్ 5 డాన్ కరాటే మాస్టర్ కందాల సందేష్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ పల్లా జాన్ రాములు జ్ఞాపకార్థకంగా నిర్వహించిన నేషనల్ షోటోకాన్ కరాటే చాంపియన్షిప్ – 2023 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పల్లా కిరణ్ కుమార్ పాల్గొని జ్యోతి వెలిగించి రూబెన్ కట్ చేసి ప్రారంభించారు . మరో విశిష్ట అతిధులు త్రీటౌన్స్ సిఐ సర్వయ్య , వింఫిల్డ్ హై స్కూల్ డైరెక్టర్లు శ్రీకాంత్ , కిషోర్ మరియు కరాటే అసోసియేషన్ ఇండియా చీఫ్ హనీ హాసన్ యం. ఇస్మాయిల్ , సౌత్ ఇండియా కరాటే చీఫ్ మహమ్మద్ ఫావద్ సయ్యద్ లు పాల్గొని పేదల పక్షపాతి, పీడిత ప్రజల నాయకులు స్వర్గీయ కీ॥శే॥ కామ్రేడ్ శ్రీ పల్లా జాన్ రాములు చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలను చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని కోరారు . కరాటే నేర్చుకోవడం వలన మానసిక ఎదుగుదల , శరీర దృడత్వం పెరిగి బలిష్టంగా కనిపిస్తారని అన్నారు . ముఖ్యంగా ఆడపిల్లలు నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ అనగా తమను తమ ఆపదలలో రక్షించుకోవడానికి దోహదపడుతుందన్నరు . చిన్ననాటి నుండి పిల్లలు కరాటే అవలంబించడం వలన పిల్లల మనసు ఉత్సాహంగా , ఉల్లాసంగా ఉండి మైండ్ షార్ప్ గా తయారవుతుందన్నారు. హైదరాబాద్ , కోరట్ల , నల్లగొండ , బొంబాయి , మహబూబాబాద్ , కోదాడ , కొత్తగూడెం భద్రాచలం , ఖమ్మం , విజయవాడ , సూర్యాపేట పలు ప్రాంతాలనుండి సుమారుగా 800 మంది పిల్లలు మరియు వివిధ జిల్లాలు , ఇతర రాష్ట్రాల కరాటే మాస్టర్స్లు , అసోసియేషన్ వారు పాల్గొన్నారు .