




మంత్రి పొంగులేటి పాలేరు క్యాంప్ కార్యాలయ ప్రవేశ పూజలు
కూసుమంచి: తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన కూసుమంచిలోని పాలేరు నియోజక వర్గ క్యాంప్ కార్యాలయ ప్రవేశ పూజలు శనివారం జరిగాయి. మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, ముఖ్య నాయకులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతా విజయవంతం కావాలని ఈ సందర్భంగా వారు మొక్కుకున్నారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కార్యాలయంలోకి ప్రవేశించారు. మంత్రి పొంగులేటి నేతృత్వంలో ప్రజలందరికీ సుపరిపాలన అందించేలా.. ఈ కార్యాలయం ఎంతో ఉపయోగపడుతుందని దయాకర్ రెడ్డి ఆకాంక్షించారు. పాలేరు నియోజక వర్గంతో పాటు ఇతర నియోజక వర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి , చావా శివ రామకృష్ణ, నేలకొండపల్లి ఎంపీపీ వజ్జా రమ్య, తిరుమలాయపాలెం ఎంపీపీ బోడ మంగీలాల్, కూసుమంచి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మట్టే గురవయ్య, ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కళ్లెం వెంకట్ రెడ్డి, మద్ది వీరా రెడ్డి, బైరు హరినాథ్ బాబు, సర్పంచ్ లు గోనె భుజంగ రెడ్డి, శివా రెడ్డి, కె.వి. చారి, మద్ది కిషోర్ రెడ్డి , అజ్మీరా అశోక్ నాయక్ , కొప్పుల చంద్ర శేఖర్, సుదాగని ఉపేందర్, మాజీ ఎంపీపీలు రామసహాయం వెంకటరెడ్డి, జూకూరి గోపాల్ రావు, కొంగర జ్యోతిర్మయి, ఉమ్మినేని కృష్ణ, యడవల్లి ముత్తయ్య, బజ్జూరి వెంకట్ రెడ్డి, పెండ్ర అంజయ్య, హఫీజుద్దీన్, యడవల్లి రాంరెడ్డి , బారి వీరభద్రం, మదాసు ఉపేందర్, ఇందుర్తి వెంకట్ రెడ్డి , లెనిన్ , సర్పంచ్ ఖాదర్ బాబా, నెల్లూరి భద్రయ్య, కొడాలి గోవింద రావు, శాఖమూరి రమేష్, కుక్కల హనుమంత రావు, వెన్నపూసల సీతా రాములు, మామిడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
