Category: ఖమ్మం నియోజకవర్గం 112

ఆల్ ఇండియా బైతుల్ ఇమ్దాద్ ఆధ్వర్యంలో రంజాన్ కిట్టు పంపిణీ
ముఖ్య అతిథి ఏసిపి పి.వి.గణేష్
ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మదర్స -ఎ- ఇస్లామియా దారుల్ ఉలూమ్ లో ఆల్ ఇండియా బైతుల్ ఇమ్దాద్ ఆధ్వర్యంలో రంజాన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పేద ముస్లింలకు ఉపవాసాలు ఉండే సమయంలో ఉపవాస దీక్షలకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా నెలకు సరిపడ సరుకులు , బియ్యం పంపిణీ చేసారు . ఈ కార్యక్రమానికి నగర ఏసిపి పి.వి. గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని నిత్యవసర సరుకులు పేద ముస్లింలకు అందజేసారు . సంస్థ నిర్వహకులు ఫ్రీ అంబులెన్స్ , ఫ్రీ నిత్యావసరాలు , చదువుకు , పెళ్లికి ఇలా సమాజంలో ఉన్న వారికి అన్ని విధాల తోడ్పాటునివ్వడాన్ని చూసి చాలా సంతోషంగా ఉందన్నారు . పండుగ అంటే అందరు జరుపుకొనేదని అందరి కోసం కొందరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది సమాజానికి మంచి సందేశం ఇస్తుందన్నారు . సుమారుగా నిరుపేద ముస్లింలకు వంద మందికి అందజేశారు . ఈ కార్యక్రమంలో అభయ హస్పిటల్ సిఈఓ కరీం , మౌలానా సాదతుల్లాహ్ , ఎండి. మునవ్వర్ (సేఫ్ బాగ్స్ ) , హాఫిజ్ ఫజల్ , హాఫిజ్ నజీర్ , ముఫ్టీ మహబూబ్ అలీ , ముఫ్టీ సల్మాన్ ఖాన్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు .

వన్ టౌన్ ఆత్మీయ సమ్మేళన
ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారి ఆదేశాల మేరకు ఖమ్మం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఖమ్మం కార్పోరేషన్ లోని 16 డివిజన్లతో సీక్వెల్ ఫంక్షన్ హాల్ నందు వన్ టౌన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా BRS జిల్లా ఇంఛార్జి శేరి సుభాష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, BRS జిల్లా అధ్యక్షులు తాత మధు గారు, ఎంపి నామా నాగేశ్వరరావు గారు, జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు పాల్గొని మాట్లాడారు.
అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు
క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపి మరింత చైతన్య పరిచేందుకు పార్టీ అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహింస్తున్నమని పేర్కొన్నారు.
నాకు BRS పార్టీ ద్వారా మీలాంటి వేల మంది కుటుంబాన్ని అందించిన ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని, అన్నిటి కంటే ముఖ్యంగా నియోజకవర్గం మొత్తం ఇలానే ప్రతి కార్యకర్త పేరు పెట్టి పిలిచే జ్ఞాపకశక్తిని నాకు జీవితాంతం దేవుడు ఇలాగే ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అని ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు.
ఖమ్మం నా ఇల్లు.. ప్రజలు నా కుటుంబ సభ్యులు అని వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రభుత్వం నుండి ప్రతి సంక్షేమం, అభివృధ్ధిని వారికి చేరువ చేయాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి మీ ద్వారా చేర్చగలిగామని వివరించారు.
దళిత బందు పథకాన్ని క్షేత్ర స్థాయిలో అందరికీ అందిస్తామని, గడచిన రెండేళ్లలో నియోజకవర్గంలోనే 2500 ఇళ్లు ఇచ్చామని, ఇంకా మరిన్ని ఇస్తామన్నారు.
నన్ను ఖమ్మం ప్రజలు అందరి వాడుగా చూసుకుంటారని, మైనారిటీలు ప్రేమతో అజయ్ ఖాన్ గా పిలుచుకుంటారు క్రైస్తవులు ప్రభువు బిడ్డగా ఆత్మీయంగా చూసుకుంటారని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని అందుకు కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
గత ఖమ్మంను నేటి ఖమ్మంతో పోల్చి చూడండి, ఒకప్పుడు ఖమ్మం నగరంలో త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ నిత్యం రోడ్ల మీద త్రాగునీటి ట్యాంకర్ లతో గల గల నడిచిన నాటి రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు.
నేడు ఎక్కడైనా వాటర్ ట్యాంకర్ లు కనబడుతున్నాయా అని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధమైన త్రాగునీరు అందిస్తున్నామని నిజమా కాదా ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మంలో కులాలు, మతాల మధ్య విద్వేషాలు రగిల్చి చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు చేసేందుకు కొందరు వస్తారని అన్నారు. జాతీయ పార్టీలు వాటికున్న బుజులు దులుపుకుని రోడ్లు ఎక్కుతున్నారని ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని సూచించారు.
నాకు ఇక్కడే ఓటు ఉంది, ఇక్కడే చదివినా.. ఇక్కడే ఉన్నా, ఇక్కడే తిరిగిన, నా బతుకు ఇక్కడే.. నా చావు కూడా ఇక్కడే అని స్పష్టం చేశారు.
ఇక్కడ ఓటు లేనోల్లు కూడా దాబులకు మాట్లాడుతారని, ఎం అర్హత ఉందో తెలియక కేసీఅర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం అని తాటాకు చప్పుళ్ళు చేస్తు, అవాక్కులు చవాక్కులు పెలుతున్నారని అన్నారు.
నీ ఊడత ఉపుడుకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని, అక్కడ ఉన్నది కేసీఅర్ గారు అని అది గుర్తుంచుకుని ప్రవర్తిస్తే మంచిదని హితువు పలికారు.

ది. 18.03.2023
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …
న్యాయం కోసం వచ్చిన బాధిత మహిళలకు అండగా నిలిచి…వారిలో మనో ధైర్యాన్ని నింపడానికి భరోసా సెంటర్ సాయపడుతోందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.
భరోసా సెంటర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా
ఖమ్మంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో గల భరోసా సెంటర్ ను ఈరోజు సందర్శించి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …
హింసకు గురైన మహిళ ఎక్కడికీ వెళ్లే అవసరం లేకుండా అన్ని సేవలు అందిస్తూ వారికి అవసరమైన కౌన్సిలింగ్, వైద్యం సదుపాయం, న్యాయ సహాయం, పోలీస్ సహాయంతో
భరోసాను కల్పిస్తున్నారని అన్నారు.
2022 మార్చి 18న ప్రారంభమైన ఈ భరోసా సెంటర్లో ఇప్పటివరకు పలు పోలీస్ స్టేషన్ల ద్వారా లైంగిక వేధింపులు మరియు లైంగిక దాడులు గురైన బాధిత మహిళల 95 కేసులని తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు 95 కేసులలో కౌన్సిలింగ్ ని,161 స్టేట్మెంట్ రికార్డింగ్-92, మెడికల్ సర్వీస్-39, కోర్టులో 164 స్టేట్మెంట్ రికార్డింగ్-90, బాధ్యత మహిళల హోం విజిట్-60, అవగాహన కార్యక్రమాలు-47, ప్రభుత్వం ద్వారా బాధితులకు ఆర్థిక సహాయం అందించడం కోసం కాంపెన్సేషన్ అప్లై -59, విద్య మరియు వసతి సౌకర్యం కోసం బాధితులను బాలల సంక్షేమ సమితి-11, భరోసా నుండి బాధితులకు సహాయం అందించడం కోసం బాధిత మహిళల సహాయ నిధి ని 11 మందికి 55 వేల రూపాయలు సహాయం అందించటం జరిగిందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి( L&O) సుభాష్ చంద్రబోస్, టౌన్ ఏసిపి గణేష్, ట్రాఫిక్ ఏసిపి రామోజీ రమేష్, ట్రాఫిక్ సిఐ అంజలి, భరోసా ఇంచార్జ్ ఎస్సై ఉమా, సంధ్యారాణి,భరోసా కోఆర్డినేటర్ రాజకుమారి మరియు స్టాప్ పాల్గొన్నారు
వీఆర్వో

కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
బిఎస్ పి పార్టీ ఆదేశానుసారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో
పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు..
మన తెలంగాణ రాష్ట్ర బహుజన ఉద్యమ రథసారథి, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు Dr.R.S. ప్రవీణ్ కుమార్ గారు నిరుద్యోగ యువకుల పక్షాన నిలబడి, వారికి జరిగిన అన్యాయానికి ప్రభుత్వాన్ని నిలదీస్తూ, Group 1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని చేసిన డిమాండ్ ను ప్రభుత్వం పెడచెవిన పెట్టిన విషయం మనందరికీ తెలుసు. అందుకే, గత్యంతరం లేని పరిస్థితులలో తెలంగాణ నిరుద్యోగ యువత యొక్క భవిష్యత్తును కాపాడడం కోసం ఆమరణ దీక్షకు పూనుకొన్న మన నాయకుడు ప్రవీణ్ కుమార్ గారని మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ లు బోయిన చంద్రశేఖర్ ముదిరాజ్, Dr. M. వెంకటేష్ చౌహన్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు దాగిల్ల దయానందరావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు Dr. సాంబశివ గౌడ్, అరుణ క్వీన్ లతోపాటు అనేకమంది రాష్ట్ర నాయకులను మరియు మహిళా నాయకురాళ్లను కూడా భారీ ఎత్తున పోలీసులు అక్రమంగా నిర్బంధించి అరెస్టులు చేయడానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని వివిధ స్థాయిలలోని నాయకులందరూ వెంటనే వీలైన చోటల్లా ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టి ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఎండకట్టి మన నాయకుల అరెస్టులకు నిరసన తెలుపాల్సిందిగా మన సెంట్రల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు రాంజీ గౌతమ్ (M.P) గారు ఆదేశించడం జరిగింది.
వెంటనే రంగంలోకి దూకుదాం పదండి.
ఇట్లు
ప్రభాకర్ మంద
రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్
తెలంగాణ

శ్రీ లక్ష్మీ శ్రీనివాస జువెలరీ షోరూమ్ ఓపెనింగ్ ఐటీ హబ్ ఆపోజిట్

బంగారం కొనండి సంపదను పెంచుకోండి◆ ప్రముఖ టీవీ యాంకర్ రష్మీ◆ ‘లక్ష్మి శ్రీనివాస జ్యూయలరీస్’ షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్◆ ఖమ్మంలో బంగారంతో మెరిసిన రష్మీ◆ భారీగా తరలివచ్చిన జన సందోహం ఖమ్మం, మార్చి 13 : ఖమ్మం…

సందేశ్ కరాటి అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ పల్లా జాన్ రాములు మెమోరియల్ నేషనల్ షోటోకాన్ కరాటే చాంపియన్షిప్ – 2023 ను ప్రారంభించిన పల్లా కిరణ్.
పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు…
ఖమ్మం : గాంధీచౌక్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో బ్లాక్ బెల్ట్ 5 డాన్ కరాటే మాస్టర్ కందాల సందేష్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ పల్లా జాన్ రాములు జ్ఞాపకార్థకంగా నిర్వహించిన నేషనల్ షోటోకాన్ కరాటే చాంపియన్షిప్ – 2023 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పల్లా కిరణ్ కుమార్ పాల్గొని జ్యోతి వెలిగించి రూబెన్ కట్ చేసి ప్రారంభించారు . మరో విశిష్ట అతిధులు త్రీటౌన్స్ సిఐ సర్వయ్య , వింఫిల్డ్ హై స్కూల్ డైరెక్టర్లు శ్రీకాంత్ , కిషోర్ మరియు కరాటే అసోసియేషన్ ఇండియా చీఫ్ హనీ హాసన్ యం. ఇస్మాయిల్ , సౌత్ ఇండియా కరాటే చీఫ్ మహమ్మద్ ఫావద్ సయ్యద్ లు పాల్గొని పేదల పక్షపాతి, పీడిత ప్రజల నాయకులు స్వర్గీయ కీ॥శే॥ కామ్రేడ్ శ్రీ పల్లా జాన్ రాములు చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలను చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని కోరారు . కరాటే నేర్చుకోవడం వలన మానసిక ఎదుగుదల , శరీర దృడత్వం పెరిగి బలిష్టంగా కనిపిస్తారని అన్నారు . ముఖ్యంగా ఆడపిల్లలు నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ అనగా తమను తమ ఆపదలలో రక్షించుకోవడానికి దోహదపడుతుందన్నరు . చిన్ననాటి నుండి పిల్లలు కరాటే అవలంబించడం వలన పిల్లల మనసు ఉత్సాహంగా , ఉల్లాసంగా ఉండి మైండ్ షార్ప్ గా తయారవుతుందన్నారు. హైదరాబాద్ , కోరట్ల , నల్లగొండ , బొంబాయి , మహబూబాబాద్ , కోదాడ , కొత్తగూడెం భద్రాచలం , ఖమ్మం , విజయవాడ , సూర్యాపేట పలు ప్రాంతాలనుండి సుమారుగా 800 మంది పిల్లలు మరియు వివిధ జిల్లాలు , ఇతర రాష్ట్రాల కరాటే మాస్టర్స్లు , అసోసియేషన్ వారు పాల్గొన్నారు .


దృష్టి లోపం లేని తెలంగాణే ప్రభుత్వ ధ్యేయం..మంత్రి పువ్వాడ..
▪️కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు..
దృష్టి లోపాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండవ విడుత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు.
ఖమ్మం కార్పోరేషన్ 14వ డివిజన్ లోని జెడ్పి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వ జనవరి 19వ తేదీన లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నదని, జూన్‌ వరకు నిర్వహించే రెండవ విడుత కంటి వెలుగులో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉన్న వైద్య బృందాలు పర్యటించి ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు.
కంటి వెలుగు వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, శిబిరాలకు వచ్చిన ప్రజలకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి వారికున్న దృష్టిలోపాన్ని బట్టి రీడింగ్‌ గ్లాసులను పంపిణీ చేస్తున్నారన్నారు.
దూరపు చూపు సమస్య ఉన్న వారికి కండ్లద్దాలను ఆర్డర్‌ ఇచ్చి వచ్చిన తరువాత పంపిణీ చేస్తున్నారని, వీటితో పాటు విటమిన్‌ ఏ, డీ, బీ కాంప్లెక్స్‌ మాత్రలు, కండ్లల్లో వేసుకోవడానికి చుక్కల మందును అందజేస్తున్నారన్నారు.
శిబిరాలు నిర్వహిస్తున్న ప్రతి చోట ప్రజలు కంటి పరీక్షలు చేయించుకుంటున్నారని, ఎవ్వరూ దృష్టిలోపం లేకుండా మంచు చూపుతో ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు.
ఈ సందర్భంగా కళ్ళఅద్దాలను పంపిణీ చేశారు. అనంతరం DM &HO మాలతీ తో మాట్లాడి జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణ వివరాలు అడిగితెలుసుకున్నారు
కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, సుడా చైర్మన్ విజయ్, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణా, కూరాకుల వలరాజ్, దేవభక్తిని కిషోర్ బాబు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

ది. 08.03.2023
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …
సమాజంలో అనితరసాధ్యమైన పాత్ర పోషిస్తున్న మహిళలు : పోలీస్ కమిషనర్
ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తూ…అనితరసాధ్యమైన
పాత్ర పోషిస్తున్న మహిళలకు
సమాజంలో గొప్ప స్ధానం వుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ బి కాన్ఫరెన్స్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసిన మహిళ పోలీస్ అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..
అభివృద్ధి, నిర్ణయాలలో ఆదర్శవంతగా కీర్తించబడే స్త్రీమూర్తి…ఉజ్వల భవిష్యత్ కు పునాది వేస్తున్నారని తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్ లో భాగంగా మహిళలకు 33% రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని అన్ని రంగాలలో మరింత రాణించాలని, నేటి పోటి ప్రపంచంలో పురుషులకు దీటుగా ప్రతికూల పరిస్థితులను అధికమించి అన్ని రకాల వ్యవస్థలను నడిపే శక్తిగా…
మహిళలు రాణిస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని, మహిళలను తక్కువ చేసే దోరణి మారిందని అన్నారు.
కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ ప్రదర్శించిన నాటిక ఎంతగానో ఆకట్టుకుంది.
మహిళలకు సంబంధించిన కేసులలో నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా పోక్సో, నిర్భయ చట్టాలను జిల్లాలో పకడ్భందిగా అమలవుతున్నాయని అన్నారు.
ముఖ్యంగా యువత, విద్యార్థినులు తమ భద్రత కోసం డయల్ 100, షీ టీమ్ సేవలను సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో వివిధ విభాగాలలో పనిచేస్తున్న పలువురు మహిళలను సన్మానించారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ( AR) కుమారస్వామి, కృష్ణ ప్రసాద్ మెమరీ స్కూల్ చైర్ పర్సన్ హృదయ మీనన్, ఏసీపీలు గణేష్, రెహమాన్, ప్రసన్న కుమార్, రవి AO అక్తరూనీసా బేగం, సిఐలు అంజలి, సర్వయ్య, సురేష్,
షీ టీమ్ ఎస్ ఉమా పాల్గొన్నారు.
పి ఆర్ వో

💐అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో… లాస్య క్లినిక్ గాంధీనగర్,ఖమ్మం త్రీ టౌన్ ఏరియా వద్ద డా,,యం యస్ చిన్ని ఆధ్వర్యంలో 9 మార్చి 2023న సాయంత్రం 5గంటలకు జరుగుతున్న ఈ కార్యక్రమమునకు సభాధ్యక్షురాలు శ్రీమతి నున్నా క్రిష్ణ ప్రియ ముఖ్యఅతిథిలుగా నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ,ఉపమేయర్ శ్రీమతి షేక్ ఫాతిమా జోహారా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత,33వ, డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి తోట ఉమా రాణి వీరభద్రరావు, ఖమ్మం నగర సర్కిల్ ఇన్సుపెక్టర్ శ్రీమతి అంజలి,నగర కార్పొరేటర్ శ్రీమతి పల్లా రోజ్ లీనా సాల్మన్ రాజు, శ్రీమతి రుద్రగాని శ్రీదేవి ఉపేందర్ కార్పొరేటర్,శ్రీమతి గట్టు కరుణ,శ్రీమతి బానోత్ ప్రమీల,శ్రీమతి యం స్వరూప రాణి,శ్రీమతి పద్మ స్వచ్ఛoద మహిళా సేవకురాలు,డా,,సుగుణ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు,డా,,శశాంక చర్మ వ్యాధుల నిపుణురాలు,డా,, పెదమళ్ల స్రవంతి, డా,,కావ్య యాలముడి తదితరులు పాల్గొంటున్నారు కావున మీకు హృదయ పూర్వక ఆహ్వానం,ముందుగా ఎన్నికచేయబడిన మహిళలకు సన్మానము మరియు నూతన వస్త్రములు బహుకరణ… పలు విభాగాల్లో పని చేస్తున్నటువంటి వారిని సన్మానించడం జరుగుతుంది డాక్టర్స్ ని ఐసిడిఎస్ వారిని ఆశా వర్కర్లని ఆయాలని మున్సిపల్ సిబ్బందిని ఫోర్త్ స్టేట్ జర్నలిస్టులని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సన్మానించడం జరిగింది కన్వీనర్…ఖమ్మం..


సిఎం కెసిఆర్ పాల‌న‌లోనే మ‌హిళ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ‌..
▪️మ‌హిళ‌ల సాధికార‌త కోస‌మే అనేక ప‌థ‌కాలు.
▪️మ‌హిళా దినోత్స‌వ కానుక‌గా రాష్ట్రంలో ఆరోగ్య మ‌హిళ ప‌థ‌కం.. వడ్డీ రహిత రుణాలు..
▪️ మహిళా అభివృద్ధితోనే దేశ ప్ర‌గ‌తి.
▪️దేశ‌లో ఎక్క‌డా లేని విధంగా డ్వాక్రా సంఘాల బ‌లోపేతం.. స్త్రీ నిధి ద్వారా 18వేల కోట్ల రుణాలు.
సిఎం కెసిఆర్ పాల‌న‌లోనే మ‌హిళ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ వ‌చ్చింది. మ‌హిళ‌ల సాధికార‌త కోసం సిఎం కెసిఆర్ గారు అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారని, మ‌హిళా దినోత్స‌వ కానుక‌గా రాష్ట్రంలో మ‌హిళా ఆరోగ్య ప‌థ‌కాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసిన మహిళలకు తినిపించారు.
బిలీఫ్ హాస్పిటల్స్ అధినేత మేడంపూడి రమాజ్యోతి అధ్వర్యంలో నాగార్జున ఫంక్షన్ హాల్ నందు జరిగిన మహిళా దినోత్సవంలో పాల్గోన్నారు.
భక్త రామదాసు కళాక్షేత్రంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రహిత రుణాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మ‌హిళ‌ల అభివృద్ధితోనే దేశ ప్ర‌గ‌తి, పురోగ‌తి జ‌రుగుతుంది. దేశ‌లో ఎక్క‌డా లేని విధంగా డ్వాక్రా సంఘాల బ‌లోపేతం మ‌న రాష్ట్రంలోనే జ‌రిగిందన్నారు. స్త్రీ నిధి ద్వారా 18వేల కోట్ల రుణాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మహిళల ఆరోగ్యం కోసం అరోగ్య మహిళ, వడ్డీ రహిత రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో పురుషుడి కంటే ధీటుగా అన్ని రంగాల్లో విస్తృతంగా రాణిస్తున్నారని, మహిళలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఅర్ గారు మహిళలకు అన్ని రంగాల్లో ఉన్నత స్థానం కల్పించారని అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తూ ఒక గొప్ప కానుక ఇచ్చిందని వారు అన్నారు.
రూ.750 కోట్ల రూపాయల భారీ నిధులను ఆడబిడ్డల కోసం విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ప్రభుత్వానికి మహిళల తరుపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ నిధుల‌లో 250 కోట్ల రూపాయ‌లు ప‌ట్ట‌ణ ప్రాంతాల మ‌హిళ‌ల కోసం కాగా, 500 కోట్లు గ్రామీణ మ‌హిళ‌ల కోస‌మ‌ని మంత్రి తెలిపారు. ఈ మొత్తం 750 కోట్ల రూపాయల నిధులతో తెలంగాణ రాష్ట్రంలో అటు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల‌లో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలకు భారీ ఎత్తున లబ్ధి చేకూరుతుందని అన్నారు.
ఇప్పటిదాకా గత ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాలకు 10 ఏండ్లలో 21 వేల 978 కోట్లు రుణాలు ఇస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 8 ఏండ్ల‌ల్లో రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ద్వారా 66 వేల 624 కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు రుణాలుగా ఇప్పించడం జరిగిందని మంత్రి వివ‌రించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వం ఇప్పటివరకు వడ్డీలేని రుణాలుగా అర్హత కలిగిన 3 లక్షల 85 వేల 82 సంఘాలకు 2 వేల 561 కోట్ల 77 లక్షలు విడుదల చేసింది. దీని ద్వారా 46 లక్షల 20 వేల 984 సంఘ సభ్యులకు లాభం చేకూరింది. తెలంగాణ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల నిధులను పెద్ద ఎత్తున విడుదల చేయడంతో సిఎం కెసిఆర్ గారికి, ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రాల్లోని అసెంబ్లీ, కౌన్సిల్ వంటి చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని అప్పటి ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, జాగృతి అధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవిత అలుపెరగకుండా గత తొమ్మిదేళ్ళ కాలం నుంచి పోరాటం చేస్తున్నారని అన్నారు.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తీర్మానాన్ని ఆమోదించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి స్వయంగా అందజేశారని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్స్ కోసం తమ పార్టీ ఎంపీలతో సహా కవిత, తాను కూడా అనేక సార్లు పార్లమెంట్ లో ప్రస్తావించామని తెలిపారు.
ఈనెల 10వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో కవిత చేపట్టనున్న మహిళా రిజర్వేషన్ల దీక్షకు దేశంలోని మహిళలు సంపూర్ణ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.
మహిళా రిజర్వేషన్లు అమలు అయితే దాదాపు 180 ఎంపీ స్థానాలు మహిళలకు దక్కుతాయని, అలాగే ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీ, కౌన్సిల్ లలో కూడా రిజర్వేషన్లు లభిస్తాయని పేర్కొన్నారు.
రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని, అయితే లోక్ సభలో మాత్రం ఈ బిల్లు ఆమోదం పొందలేదు అని, ప్రధాని నరేంద్ర మోడీ తలుచుకుంటే ఇది సాధ్యం అవుతుందని, కానీ బిజెపికి చిత్తశుద్ధి లేదని వారు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రుణాలను అందజేశారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు, పలు రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్న పలువురుకి మహిళలకు శాలువాతో సత్కరించారు.
ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార,ZP చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, సుడా చైర్మన్ విజయ్, AMC చైర్మన్ శ్వేత, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, DM &HO మాలతి, ZPTC ప్రియాంక, వివిధ శాఖ అధికారులు ఉన్నారు.

You missed