ది. 18.03.2023
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …
న్యాయం కోసం వచ్చిన బాధిత మహిళలకు అండగా నిలిచి…వారిలో మనో ధైర్యాన్ని నింపడానికి భరోసా సెంటర్ సాయపడుతోందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.
భరోసా సెంటర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా
ఖమ్మంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో గల భరోసా సెంటర్ ను ఈరోజు సందర్శించి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …
హింసకు గురైన మహిళ ఎక్కడికీ వెళ్లే అవసరం లేకుండా అన్ని సేవలు అందిస్తూ వారికి అవసరమైన కౌన్సిలింగ్, వైద్యం సదుపాయం, న్యాయ సహాయం, పోలీస్ సహాయంతో
భరోసాను కల్పిస్తున్నారని అన్నారు.
2022 మార్చి 18న ప్రారంభమైన ఈ భరోసా సెంటర్లో ఇప్పటివరకు పలు పోలీస్ స్టేషన్ల ద్వారా లైంగిక వేధింపులు మరియు లైంగిక దాడులు గురైన బాధిత మహిళల 95 కేసులని తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు 95 కేసులలో కౌన్సిలింగ్ ని,161 స్టేట్మెంట్ రికార్డింగ్-92, మెడికల్ సర్వీస్-39, కోర్టులో 164 స్టేట్మెంట్ రికార్డింగ్-90, బాధ్యత మహిళల హోం విజిట్-60, అవగాహన కార్యక్రమాలు-47, ప్రభుత్వం ద్వారా బాధితులకు ఆర్థిక సహాయం అందించడం కోసం కాంపెన్సేషన్ అప్లై -59, విద్య మరియు వసతి సౌకర్యం కోసం బాధితులను బాలల సంక్షేమ సమితి-11, భరోసా నుండి బాధితులకు సహాయం అందించడం కోసం బాధిత మహిళల సహాయ నిధి ని 11 మందికి 55 వేల రూపాయలు సహాయం అందించటం జరిగిందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి( L&O) సుభాష్ చంద్రబోస్, టౌన్ ఏసిపి గణేష్, ట్రాఫిక్ ఏసిపి రామోజీ రమేష్, ట్రాఫిక్ సిఐ అంజలి, భరోసా ఇంచార్జ్ ఎస్సై ఉమా, సంధ్యారాణి,భరోసా కోఆర్డినేటర్ రాజకుమారి మరియు స్టాప్ పాల్గొన్నారు
వీఆర్వో

కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
బిఎస్ పి పార్టీ ఆదేశానుసారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో
పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు..
మన తెలంగాణ రాష్ట్ర బహుజన ఉద్యమ రథసారథి, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు Dr.R.S. ప్రవీణ్ కుమార్ గారు నిరుద్యోగ యువకుల పక్షాన నిలబడి, వారికి జరిగిన అన్యాయానికి ప్రభుత్వాన్ని నిలదీస్తూ, Group 1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని చేసిన డిమాండ్ ను ప్రభుత్వం పెడచెవిన పెట్టిన విషయం మనందరికీ తెలుసు. అందుకే, గత్యంతరం లేని పరిస్థితులలో తెలంగాణ నిరుద్యోగ యువత యొక్క భవిష్యత్తును కాపాడడం కోసం ఆమరణ దీక్షకు పూనుకొన్న మన నాయకుడు ప్రవీణ్ కుమార్ గారని మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ లు బోయిన చంద్రశేఖర్ ముదిరాజ్, Dr. M. వెంకటేష్ చౌహన్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు దాగిల్ల దయానందరావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు Dr. సాంబశివ గౌడ్, అరుణ క్వీన్ లతోపాటు అనేకమంది రాష్ట్ర నాయకులను మరియు మహిళా నాయకురాళ్లను కూడా భారీ ఎత్తున పోలీసులు అక్రమంగా నిర్బంధించి అరెస్టులు చేయడానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని వివిధ స్థాయిలలోని నాయకులందరూ వెంటనే వీలైన చోటల్లా ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టి ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఎండకట్టి మన నాయకుల అరెస్టులకు నిరసన తెలుపాల్సిందిగా మన సెంట్రల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు రాంజీ గౌతమ్ (M.P) గారు ఆదేశించడం జరిగింది.
వెంటనే రంగంలోకి దూకుదాం పదండి.
ఇట్లు
ప్రభాకర్ మంద
రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్
తెలంగాణ

జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో శ్రీ రుక్మిణి సమేత శ్రీ సంతాన వేణుగోపాలస్వామి వారి పున ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం గారు దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదుపరి ఆలయ కమిటీ వారు చైర్మన్ గారిని శాలువాతో సత్కరించారు.

శ్రీ లక్ష్మీ శ్రీనివాస జువెలరీ షోరూమ్ ఓపెనింగ్ ఐటీ హబ్ ఆపోజిట్

బంగారం కొనండి సంపదను పెంచుకోండి◆ ప్రముఖ టీవీ యాంకర్ రష్మీ◆ ‘లక్ష్మి శ్రీనివాస జ్యూయలరీస్’ షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్◆ ఖమ్మంలో బంగారంతో మెరిసిన రష్మీ◆ భారీగా తరలివచ్చిన జన సందోహం ఖమ్మం, మార్చి 13 : ఖమ్మం…

సందేశ్ కరాటి అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ పల్లా జాన్ రాములు మెమోరియల్ నేషనల్ షోటోకాన్ కరాటే చాంపియన్షిప్ – 2023 ను ప్రారంభించిన పల్లా కిరణ్.
పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు…
ఖమ్మం : గాంధీచౌక్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో బ్లాక్ బెల్ట్ 5 డాన్ కరాటే మాస్టర్ కందాల సందేష్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ పల్లా జాన్ రాములు జ్ఞాపకార్థకంగా నిర్వహించిన నేషనల్ షోటోకాన్ కరాటే చాంపియన్షిప్ – 2023 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పల్లా కిరణ్ కుమార్ పాల్గొని జ్యోతి వెలిగించి రూబెన్ కట్ చేసి ప్రారంభించారు . మరో విశిష్ట అతిధులు త్రీటౌన్స్ సిఐ సర్వయ్య , వింఫిల్డ్ హై స్కూల్ డైరెక్టర్లు శ్రీకాంత్ , కిషోర్ మరియు కరాటే అసోసియేషన్ ఇండియా చీఫ్ హనీ హాసన్ యం. ఇస్మాయిల్ , సౌత్ ఇండియా కరాటే చీఫ్ మహమ్మద్ ఫావద్ సయ్యద్ లు పాల్గొని పేదల పక్షపాతి, పీడిత ప్రజల నాయకులు స్వర్గీయ కీ॥శే॥ కామ్రేడ్ శ్రీ పల్లా జాన్ రాములు చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలను చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని కోరారు . కరాటే నేర్చుకోవడం వలన మానసిక ఎదుగుదల , శరీర దృడత్వం పెరిగి బలిష్టంగా కనిపిస్తారని అన్నారు . ముఖ్యంగా ఆడపిల్లలు నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ అనగా తమను తమ ఆపదలలో రక్షించుకోవడానికి దోహదపడుతుందన్నరు . చిన్ననాటి నుండి పిల్లలు కరాటే అవలంబించడం వలన పిల్లల మనసు ఉత్సాహంగా , ఉల్లాసంగా ఉండి మైండ్ షార్ప్ గా తయారవుతుందన్నారు. హైదరాబాద్ , కోరట్ల , నల్లగొండ , బొంబాయి , మహబూబాబాద్ , కోదాడ , కొత్తగూడెం భద్రాచలం , ఖమ్మం , విజయవాడ , సూర్యాపేట పలు ప్రాంతాలనుండి సుమారుగా 800 మంది పిల్లలు మరియు వివిధ జిల్లాలు , ఇతర రాష్ట్రాల కరాటే మాస్టర్స్లు , అసోసియేషన్ వారు పాల్గొన్నారు .


దృష్టి లోపం లేని తెలంగాణే ప్రభుత్వ ధ్యేయం..మంత్రి పువ్వాడ..
▪️కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు..
దృష్టి లోపాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండవ విడుత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు.
ఖమ్మం కార్పోరేషన్ 14వ డివిజన్ లోని జెడ్పి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వ జనవరి 19వ తేదీన లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నదని, జూన్‌ వరకు నిర్వహించే రెండవ విడుత కంటి వెలుగులో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉన్న వైద్య బృందాలు పర్యటించి ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు.
కంటి వెలుగు వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, శిబిరాలకు వచ్చిన ప్రజలకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి వారికున్న దృష్టిలోపాన్ని బట్టి రీడింగ్‌ గ్లాసులను పంపిణీ చేస్తున్నారన్నారు.
దూరపు చూపు సమస్య ఉన్న వారికి కండ్లద్దాలను ఆర్డర్‌ ఇచ్చి వచ్చిన తరువాత పంపిణీ చేస్తున్నారని, వీటితో పాటు విటమిన్‌ ఏ, డీ, బీ కాంప్లెక్స్‌ మాత్రలు, కండ్లల్లో వేసుకోవడానికి చుక్కల మందును అందజేస్తున్నారన్నారు.
శిబిరాలు నిర్వహిస్తున్న ప్రతి చోట ప్రజలు కంటి పరీక్షలు చేయించుకుంటున్నారని, ఎవ్వరూ దృష్టిలోపం లేకుండా మంచు చూపుతో ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు.
ఈ సందర్భంగా కళ్ళఅద్దాలను పంపిణీ చేశారు. అనంతరం DM &HO మాలతీ తో మాట్లాడి జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణ వివరాలు అడిగితెలుసుకున్నారు
కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, సుడా చైర్మన్ విజయ్, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణా, కూరాకుల వలరాజ్, దేవభక్తిని కిషోర్ బాబు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

ది. 08.03.2023
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …
సమాజంలో అనితరసాధ్యమైన పాత్ర పోషిస్తున్న మహిళలు : పోలీస్ కమిషనర్
ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తూ…అనితరసాధ్యమైన
పాత్ర పోషిస్తున్న మహిళలకు
సమాజంలో గొప్ప స్ధానం వుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ బి కాన్ఫరెన్స్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసిన మహిళ పోలీస్ అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..
అభివృద్ధి, నిర్ణయాలలో ఆదర్శవంతగా కీర్తించబడే స్త్రీమూర్తి…ఉజ్వల భవిష్యత్ కు పునాది వేస్తున్నారని తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్ లో భాగంగా మహిళలకు 33% రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని అన్ని రంగాలలో మరింత రాణించాలని, నేటి పోటి ప్రపంచంలో పురుషులకు దీటుగా ప్రతికూల పరిస్థితులను అధికమించి అన్ని రకాల వ్యవస్థలను నడిపే శక్తిగా…
మహిళలు రాణిస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని, మహిళలను తక్కువ చేసే దోరణి మారిందని అన్నారు.
కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ ప్రదర్శించిన నాటిక ఎంతగానో ఆకట్టుకుంది.
మహిళలకు సంబంధించిన కేసులలో నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా పోక్సో, నిర్భయ చట్టాలను జిల్లాలో పకడ్భందిగా అమలవుతున్నాయని అన్నారు.
ముఖ్యంగా యువత, విద్యార్థినులు తమ భద్రత కోసం డయల్ 100, షీ టీమ్ సేవలను సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో వివిధ విభాగాలలో పనిచేస్తున్న పలువురు మహిళలను సన్మానించారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ( AR) కుమారస్వామి, కృష్ణ ప్రసాద్ మెమరీ స్కూల్ చైర్ పర్సన్ హృదయ మీనన్, ఏసీపీలు గణేష్, రెహమాన్, ప్రసన్న కుమార్, రవి AO అక్తరూనీసా బేగం, సిఐలు అంజలి, సర్వయ్య, సురేష్,
షీ టీమ్ ఎస్ ఉమా పాల్గొన్నారు.
పి ఆర్ వో

మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ఢిల్లీ జంతర్మంతర్లో ఒకరోజు దీక్ష చేసిన ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత

భారత జాగృతి జంతర్ మంతర్ ఢిల్లీలో నిరసన దీక్ష ….. పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు …భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసన దీక్ష ప్రారంభించారు. మహిళలకు 33%…

💐అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో… లాస్య క్లినిక్ గాంధీనగర్,ఖమ్మం త్రీ టౌన్ ఏరియా వద్ద డా,,యం యస్ చిన్ని ఆధ్వర్యంలో 9 మార్చి 2023న సాయంత్రం 5గంటలకు జరుగుతున్న ఈ కార్యక్రమమునకు సభాధ్యక్షురాలు శ్రీమతి నున్నా క్రిష్ణ ప్రియ ముఖ్యఅతిథిలుగా నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ,ఉపమేయర్ శ్రీమతి షేక్ ఫాతిమా జోహారా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత,33వ, డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి తోట ఉమా రాణి వీరభద్రరావు, ఖమ్మం నగర సర్కిల్ ఇన్సుపెక్టర్ శ్రీమతి అంజలి,నగర కార్పొరేటర్ శ్రీమతి పల్లా రోజ్ లీనా సాల్మన్ రాజు, శ్రీమతి రుద్రగాని శ్రీదేవి ఉపేందర్ కార్పొరేటర్,శ్రీమతి గట్టు కరుణ,శ్రీమతి బానోత్ ప్రమీల,శ్రీమతి యం స్వరూప రాణి,శ్రీమతి పద్మ స్వచ్ఛoద మహిళా సేవకురాలు,డా,,సుగుణ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు,డా,,శశాంక చర్మ వ్యాధుల నిపుణురాలు,డా,, పెదమళ్ల స్రవంతి, డా,,కావ్య యాలముడి తదితరులు పాల్గొంటున్నారు కావున మీకు హృదయ పూర్వక ఆహ్వానం,ముందుగా ఎన్నికచేయబడిన మహిళలకు సన్మానము మరియు నూతన వస్త్రములు బహుకరణ… పలు విభాగాల్లో పని చేస్తున్నటువంటి వారిని సన్మానించడం జరుగుతుంది డాక్టర్స్ ని ఐసిడిఎస్ వారిని ఆశా వర్కర్లని ఆయాలని మున్సిపల్ సిబ్బందిని ఫోర్త్ స్టేట్ జర్నలిస్టులని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సన్మానించడం జరిగింది కన్వీనర్…ఖమ్మం..

వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో జాతీయ ఎడ్ల బండ లాగుడు పందాలు పురుషుల కబడ్డీ పోటీల్లో పాల్గొన్న మంత్రి ఎమ్మెల్యే

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో సత్తుపల్లి పట్టణంలో నిర్వహించిన భారీ వాహనాల ర్యాలీ ఉత్సాహంగా సాగింది. వేంసూరు మండలం, కందుకూరు వేదిక సాగిన జాతీయ ఎండ్ల బండలాగుడు, పురుషుల కబడ్డీ పోటీల సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖమంత్రి…

You missed